Sunday, August 6, 2017

"ధర్మార్ధ కామ మోక్షాణామ్ ఆరోగ్య మూలముత్తమమ్ "
ఆయుర్వేద ఒౌషధ సేవన వలన శరీరంలో సహజంగా వున్న జీవశక్తిని (రెసిస్టెన్స్ పవర్) పెంపొందించుచూ వ్యాధులను నిర్మూలిస్తుంది. కనుక ఆయుర్వేద ఒౌషధములకు ఏవిధమైన దుష్ప్రభావాలు వుండవు.
ఆకలి అయినప్పుడు అన్నం తిన్నట్లే, రోగం వస్తే ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం వల్ల రోగ నివారణతో పాటు, శరీరానికి శక్తి సామర్ధ్యాలు సమకూరుతాయి.
ఆయుర్వేద వైద్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపిద్దాం. ఆరోగ్యవంతులు మాత్రమే మంచి ఆలోచనలతో ప్రగతి సాధించగలరు.
"మంత్రమునకు పనికిరాని అక్షరం లేదు, వైద్యమునకు పనికారాని మొక్క లేదు, ఆయుర్వేద ఒౌషధముల వలన నయము కాని వ్యాధి లేనేలేదు".

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

మడమ నొప్పి

ఏ అవయవం పనితీరు పైనైనా మన దృష్టి పడుతోందీ అంటే ఆ అవయవంలో ఏదో సమస్య ఉందని అర్థం. ఎవరైనా మడమల్నీ, పాదాల్నీ తరుచూ చూసుకుంటూ, ఆవైపు, ఈ వైపు నొక్కుకుంటున్నారూ అంటే నిరంతరంగా, ఏదో బాధ వేధిస్తోందని ఇట్టే గ్రహించవచ్చు.. అయినా శరీరంలో కళ్లూ, కాళ్లూ సరిగా లేనిదే అడుగైనా ముందుకు వేయలేం కదా! మడమనొప్పులు ఉన్నవారి పరిస్థితే ఇది. ఈ సమస్య రావడానికి గల కారణాల్లోకి వెళితే....
నడిచే విధానం సరిగా లేకపోయినా, వాడే చెప్పులు సరియైనవి కాకపోయినా, ఎత్తుపల్లాల్లో నడుస్తున్నప్పుడు అడుగులు సరిగా వేయలేకపోయినా మడమ నొప్పులు వస్తాయి. ఇవే కాకుండా, స్థూలకాయం ఉన్నా, వాత సంబంధిత వ్యాధులున్నా, ధాతుక్షయం జరిగినా మడమనొప్పులు వస్తాయి. రోజూ కనీసంగానైనా నడవలేకపోయినా, అతిగా నడిచినా, అత్యుష్ణము అను కారణాలచేత కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి సమస్యకు అదేపనిగా మందులు వాడకుండా, ఆయుర్వేదంలోని గృహవైద్య విధానంతో పూర్తిగా బయటపడే ప్రయత్నం చేయవచ్చు.
కొన్ని ఉత్తమ చిట్కాలు:
(1) శొంఠిని శుభ్రపరిచి చూర్ణం చేసి ఉంచుకోవాలి. అందులోంచి 5 గ్రాముల శొంఠి చూర్ణాన్ని, 100 మి. లీటర్ల నీళ్లల్లో కలిపి, అవి 50 మి.లీటర్లు అయ్యేదాకా బాగా కాచి, అలా తయారైన కషాయాన్ని వడగట్టి అందులో 15 మి. లీ ఆముదం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు నొప్పి పూర్తిగా తగ్గేవరకు తాగాలి.
(2) నిమ్మకాయలను రెండు ముక్కలుగా కోసి, పెనం పైన వేడి చేసి, మడమల మీద కాపడం పెట్టాలి.
(3) పెట్రోల్ ను నొప్పి వున్న భాగంపై మర్ధన చేయడం అనేది మడమనొప్పికి అత్యుత్తమ చికిత్సగా చెప్పవచ్చు.
పైన చెప్పినవి పాటించడంతో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, కళ్ళు ఉప్పును నిప్పుపై వెచ్చ చేసి, ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే మడమనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Back Pain

ఆయుర్వేదంతో వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం


ఈ రోజుల్లో స్పాండిలైటిస్‌ అనే  మాట ప్రతి పదిమందిలో ముగ్గురి నోట వినిపిస్తూనే ఉంది.  మూలస్థంభం లాంటి వెన్నెముక దెబ్బ తింటే ఎవరైనా ఆ విషయమై మాట్లాడకుండా ఎలా ఉంటారు?  కాకపోతే  వెన్నెముక లేదా డిస్కులకు సంబంధించిన ప్రతి సమస్యకూ సర్జరీయే పరిష్కారం అంటూ సాగుతున్న ప్రచారం చాలామంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నునొప్పి కోసం సర్జరీ చేయించుకుంటే ఆ నొప్పి తాత్కాలికంగా తగ్గుతోందే కానీ, శాశ్వతంగా పోవడం లేదు.  దానికి వెన్నునొప్పి రావడానికి గల అసలు కారణం తెలియకపోవడమే సమస్య అయితే,  వాత,పిత్త,కఫాల దోషాలను, ధాతుక్షయాన్ని సమర్థవంతంగా నిర్మూలించడం ద్వారా ఆయుర్వేదం ఒక్కటే  స్పాండిలైటిస్‌ సమస్యలను సమూలంగా తొలగించగలుగుతుంది.                              

జీవితాంతం మనం వెన్నెముకతో సహజీవనం చేస్తున్నా దాని గురించి మనకు  తెలిసింది చాలా తక్కువ. వాస్తవానికి  వెన్నెముకది ఒక అద్భుతమైన నిర్మాణం. శరీరాన్ని నిలబెట్టడంలో దాని భూమిక ఎంతో కీలకం. శరీరంలోని సమస్త అవయవాలకూ వెన్నెముక ఒక మూలస్థంభంలా ఉంటుంది. అలా ఒక మూల స్థంభంలా నిలబడటానికి వెయ్యికి పైగా లిగమెంట్లు, కీళ్ల కదలికలకు తోడ్పడే  134 సర్ఫేస్‌లు ఉంటాయి.  మెదడు చివరనుంచి మొదలయ్యే ఈ వెన్నెముకలో మెదడులో ఉండే న్యూరల్‌ సెల్స్‌, వెన్నెముకలోనూ ఉంటాయి. వెన్నెముక శరీరానికీ మెదడుకూ మధ్య ఒక సంధాన కర్తగా ఉంటుంది. అన్నిటినీ మించి మెదడు పంపించే ప్రతి సంకేతాన్నీ, ప్రతి సమాచారాన్నీ శరీరానికి చేరవేసే ఒక రహదారి. మరోరకంగా చెప్పాలంటే వెన్నెముక ఆరోగ్యానికి సంబంధించిన ఒక కీబోర్డు. అన్నీ సవ్యంగా ఉంటే వెన్నెముక దాని విధి నిర్వహణలన్నీ సఖ్యంగానే ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో ఒక చోట తేడా వచ్చినప్పుడు మొత్తం వ్యవస్థ అంతా చిందరవందర అవుతుంది.

కారణాలు అనేకం:

ఆధునిక జీవన శైలిలో పలు అంశాలు ఇందుకు కారణమవుతాయి. వాటిలో ప్రత్యేకించి సమయపాలన లేని భోజనం కావచ్చు. గంటల తరబడి  కద లకుండా కూర్చునే ఉద్యోగ వ్యాపారాలు  కావచ్చు. కదలడం, కూర్చోవడం, నిలుచోవడం వంటి భంగిమల్లోని లోపాలు కావచ్చు. వ్యాయామమే లేకపోవడం కావచ్చు. లేదా అతిగా వ్యాయామం చేయడమే కావచ్చు. ఎడతెగని ఒత్తిళ్లే కావచ్చు. మొత్తంగా చూస్తే  వీటన్నిటి ద్వారా మన శరీరాన్ని మనం దెబ్బ తీసుకుంటున్నాం. దీనివల్ల వెన్నులో భాగమైన కార్టిలేజ్‌, లిగమెంట్లు, టెండాన్లు ఎముకలు దెబ్బతిని  మెడ, వెన్ను భాగాల్లో ఎన్నో తేడాలు వస్తాయి, ఇలాంటి పలురకాల తేడాలతో వచ్చే సమస్యల్లో స్పాండిలైటిస్‌ ఒకటి. నిరంతరం దెబ్బతింటూ, క్షీణావస్థకు గురికావడం వల్ల వెన్నెముకలో వచ్చే ప్రధాన సమస్య ఇది.

స్పాండిలైటిస్‌ అంటే?:

వెన్నెముకలోఉండే కీళ్లకు ఒక క్షీణగతికి తెచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌ రావడాన్నే స్పాండిలైటిస్‌ అంటారు. వెన్నుపూసలో ఉండే దృఢత్వం తగ్గిపోవడం ఇందులోని ప్రధాన సమస్య. వెన్నుపూస దెబ్బతిన్న చోట  బోనీ స్పర్స్‌ లేదా అస్టియో ఫైట్స్‌ అనే బొడిపెలు ఉత్పన్నమవుతాయి.  ఇవి వెన్నుపాము మీద ఒత్తిడి కలిగిస్తాయి. నరాలు, వెన్నెముకపై ఒత్తిడి పడితే  దాని తాలూకు సమస్యలు మొదలవుతాయి. ప్రత్యేకించి మెదడునుంచి శరీరానికి చేరవలసిన సంకేతాలకు , సమాచారానికి సంబంధించిన మార్గం తెగిపోతుంది. ఒకప్పుడు ఈ సమస్య దాదాపు  45 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేది. ఆధునిక కాలంలో ఇది వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వచ్చేస్తోంది.

అయితే పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు వారిలో సహజంగా ఉండే రుతుక్రమం, హార్మోనల్‌ సమస్యలు, మెనోపాజ్‌కు ముందు లేదా  తరువాత వారిలో వచ్చే హార్మోన్‌ సంబంధిత మార్పులు  గర్భధారణ కారణంగా పెరిగే ఒత్తిళ్లు ఇందుకు ప్రధాన  కారణంగా ఉంటాయి. ప్రత్యేకించి క్యాల్షియం లోపాలను కలిగించే ప్రతి సమస్యా స్పాండిలైటిస్‌కు కారణమవుతూ ఉంటుంది. దీనికి తోడు స్థూలకాయం కూడా ఇందుకు కారణమే. గతంలో మెడ, వెన్ను భాగంలో శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా ఈ సమస్యకు గురికావచ్చు. వీరిలో డిస్కు సమస్యలు ఉన్నవారు కూడా స్పాండిలైటిస్‌ సమస్యకు గురికావచ్చు. ఎముకలు గుల్లబారిపోయే ఆస్టియోపొరోసిస్‌ ఉన్నవారు కూడా ఈ సమస్యకు గురికావచ్చు.

స్పాండిలైటిస్‌లో ఏమవుతుంది?

రోజురోజుకు  వెన్నెముక క్షీణిస్తూ వెళ్లడాన్నే స్పాండిలైటిస్‌ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో వెన్నెముకకు, డిస్కులకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల డిస్కుకి పైన, కింద ఉండే అంచులకు నీటిని పీల్చుకునే గుణం తగ్గిపోతుంది. ఇలా వాటి  నీటి పరిమాణం తగ్గడం వల్ల డిస్కులు కుదించుకుపోతాయి. వాటి ఎత్తు తగ్గిపోవడం చాలా స్పష్టంగా  కనిపిస్తుంది. ఆయా భాగాలు విస్తరించే గుణం కూడా కోల్పోతాయి. ఫలితంగా అక్కడున్న కణజాలమంతా  గట్టిపడిపోతుంది. వెన్నుపూసలో పూసకూ పూసకూ మధ్య ఉండే ఫేసెట్‌ జాయింట్ల మీద ఒత్తిడి పెరిగి రాపిడి పెరుగుతుంది. దీనివల్ల కార్టిలేజ్‌ దెబ్బతింటుంది.

 అయితే శరీర తన సహజ స్వభావం కొద్దీ దెబ్బ తిన్న భాగాలకు క్యాల్షియంను చేరవేస్తుంది. అవసరానికి మించి అలా క్యాల్షియంను చేర్చడం ద్వారా అక్కడ ఆస్టియోఫైట్స్‌ అంటే బొడిపెలు ఏర్పడతాయి. ఒకసారి  బొడిపెలు ఏర్పడటం మొదలయ్యిందీ అంటే అది ఎప్పటికీ తగ్గదు. ఎన్నిసార్లు శస్త్ర చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదు. ఈ బొడిపెలు పక్కనున్న నరాలు అంటే వెన్నుపాము మీద ఒత్తిడి  పడుతుంది. వెన్ను భాగంలో ఇన్ని మార్పులు జరిగినా స్కానింగ్‌ పరీక్షల్లో  అన్నీ నార్మల్‌గానే కనపడతాయి. చాలా మంది డాక్టర్లు  అసలు  మీకు ఏ సమస్యాలేదని. మీరు మానసికంగా అలాంటి భ్రాంతికి గురవుతున్నారని, ఇది సైకోసొమాటిక్‌ వ్యాధి అని  చెప్పి వదిలేస్తారు. పరీక్షా రిపోర్టులు నార్మల్‌ అని వచ్చినంత మాత్రాన మీరు ఆరోగ్యవంతులని కాదు కదా! మీరు అనారోగ్యంతో ఉన్నారని మిమ్మల్ని వేధిస్తున్న లక్షణాలే  చెబుతున్నాయి.

 ఆధునిక పరీక్షల్లో వ్యాధి ఒక పూర్తి రూపం ధరించినప్పుడు తప్ప వ్యాధిగా మారుతున్న  క్రమంలో గుర్తించే శక్తి లేదు. అయితే ఆయుర్వేద పరీక్షల్లో మాత్రం ఈ స్థితిలో కూడా సమస్యను గుర్తించే మార్గం ఉంది. అత్యంత సూక్ష్మస్థాయిలో అంటే వాయురూపంలో ఉండే వ్యాధిని సైతం గుర్తించగలిగే ఆయుర్వేద విధానంలోని ప్రత్యేకతే  ఇందుకు కారణం.

సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ లక్షణాలు:

మెడ, ఛాతీ భాగంలో ఉండే ఈ సర్వైకల్‌లో ఏడు డిస్కులు ఉంటాయి. అయితే సమస్య ఎక్కువగా వచ్చేది సి4-సి5, సి5-సి6, సి6-సి7 డిస్కుల్లోనే. ఈ భాగంలో సమస్య తలెత్తినప్పుడు  కొద్దిపాటి అసౌకర్యంగానో, స్వల్పమైన నొప్పిగానో, లేదా భరించలేనంత నొప్పిగానో ఉండవచ్చు. నొప్పి మరీ తీవ్రమైనప్పుడు కనీసం కదల్లేని స్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ స్థితిలో నొప్పి మూడు దశల్లో ఉంటుంది. అందులో  సర్వైకల్‌  ర్యాడికులోపతి, సర్వైకల్‌ మైలోపతి, సర్వైకల్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ ఇవి  ఆ మూడు దశలు. సర్వైకల్‌ ర్యాడికులోపతిలో ఇందులో ప్రధానంగా తలనొప్పి ఉంటుంది. నొప్పి మెడ, భుజాల మద్య, చేతిపొడవునా ఉండవచ్చు చెయ్యంతా లాగినట్లు అనిపించవచ్చు. ముఖంలోని వివిధ భాగాల్లో నొప్పి అనిపించవచ్చు.  ఒక్కోసారి కళ్లు తిరిగిపడిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సర్వైకల్‌ మైలోపతిలోచేతి, భుజం కండరాలు బలహీనమవుతాయి, ఫలితంగా  అల్లికలు, కుట్లు, పెయింటింగ్‌, రైటింగ్‌ ఇలాంటి నైపుణ్యాలన్నీ దెబ్బ తింటాయి. మెడ, భుజం భాగాల్లో కండరాలన్నీ క్షీణిస్తూ, ఎండిపోయినట్లుమారతాయి. బ్యాలెన్స్‌ కోల్పోయి పదే పదే పడిపోయే స్థితి కూడా ఏర్పడవచ్చు. సర్వైకల్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ నొప్పి ఏదో ఒక కేంద్రీకృతమై ఉండడాన్ని ఆగ్జియల్‌‘ జాయింట్‌ పెయిన్‌ అంటారు.

లంబార్‌ స్పాండిలైటిస్‌:

ఎల్‌1 నుంచి ఎల్‌5-ఎస్‌1 దాకా ఈ సమస్య ఉండవచ్చు. ఇందులోనూ లంబార్‌ ర్యాడికులోపతి, లంబార్‌ మైలోపతి, లంబార్‌ ఆగ్జియల్‌ జాయింట్‌ పెయిన్‌ అంటూ మూడు దశలు ఉంటాయి. ర్యాడికులోపతిలో నొప్పి, పొడిచినట్లు ఉండడం, మంట, మొద్దుబారడం వంటి లక్షణాలు ఉంటాయి. పిరుదు, తొడవెనుక భాగం, పిక్కల వెనుక భాగంలో మడమ, పాదాల్లో  ఈ భాధలు ఉంటాయి. ఇది గజ్జల భాగంలో కొన్ని సార్లు వృషణాలు, జననాంగం దాకా ఈ నొప్పి ఉండవచ్చు. తొడ, పిక్కలు పట్టేసే సయాటికా లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఒక్కోసారి కడుపులోనూ, మూత్రాశయంలోనూ నొప్పి రావచ్చు. మైలోపతిలో కాళ్లలోని  కండరాలన్నీ క్షీణించిపోయి నడవడం కాదు ఒక దశలో అసలు  కదల్లేని స్థితి ఏర్పడవచ్చు. మల మూత్ర విసర్జనలోనూ సమస్య  మొదలు కావచ్చు. డిస్కు దెబ్బ తిన్న భాగంలోనే కేంద్రీకృతమైన తీవ్రమైన నొప్పిరావచ్చు. ఎక్కువ సేపు నిలుచున్నా, కూర్చున్నా, నొప్పిరావచ్చు.

ఆయుర్వేద చికిత్స:
సమస్యకు అసలు కారణమైన వాత,పిత్త కఫాలను, అగ్నిని  సాధారణ స్థితికి తీసుకురావడం, సస్తధాతువులను సామ్యావస్థకు తీసుకు రావడం ఈ లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుంది,  ఈ  క్రమంలో ఆయా వ్యక్తుల శరీర తత్వాన్ని అనుసరించి చికిత్స వుటుంది.

 ఆయుర్వేదం ద్వారా ప్రధానంగా రెండు ప్రయోజనాలు కలుగుతాయి వాటిలో దీర్ఘకాలికంగా వెంటాడుతున్న మీ బాధలన్నీ తొలగిపోతాయి. అదే సమయంలో వచ్చిన వ్యాధి మరోసారి వచ్చే అవకాశం లేకుండా వ్యాధి మూలాలన్నీ మటుమాయమైపోతాయి. ఆయుర్వేద వైద్య చికిత్సలతో తిరిగి మీ పూర్వ ఆరోగ్యాన్ని పొందడమే కాదు, గతం కంటే అద్భుత మైన ఒక కొత్త జీవ చైతన్యం. ఒక కొత్త జీవితం మీ సొంతమవుతాయి.

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.


సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
 For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/



Rheumatoid Arthritis

రుమాటాయిడ్‌ ఆర్ధరైటిస్ కు సమూల వైద్యం

‘రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌’ అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అనగా మన శరీర రోగనిరోధక వ్యవస్థ పొరబడి, మన సొంత కణజాలంపై దాడిచేయడం వలన కలిగే వ్యాధులను ఆటోఇమ్యూన్‌ వ్యాధులు అని అంటారు. ఈ వ్యాధినే వాడుక భాషలో ‘వాతదోషం’ అని అంటారు. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ వ్యాధి ఎక్కువగా 40 సం.. వయస్సు పైబడిన వారిలో తలెత్తుతుంది. పురుషుల కంటే స్ర్తీలలో 3 రెట్లు అధికంగా, ముఖ్యంగా రుతుచక్రం ఆగిపోయిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 16 సం.. వయస్సు లోపువారిలో ఈ వ్యాధి తలెత్తినచో, దీనిని వైద్య పరిభాషలో ‘జువైనల్‌ ఆర్థరైటిస్‌’ అని అంటారు.

ఈ వ్యాధి కేవలం కీళ్లనే కాకుండా, ఇతర ముఖ్య అవయవాలైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మం మరియు శరీరంలోని వివిధ రకాల కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా కీళ్ళలోని సైనోవియం పొరను శోథమునకు గురిచేసి, తద్వారా క్రమంగా కీళ్లలోని ఎముకలను, వాటి తాలుకు కార్టిలేజ్‌ని కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా కీళ్లు వాటి ఆకారం, అమరికను కోల్పోయి విపరీతమైన నొప్పి కలగటంతో పాటు కీళ్ల కదలికలు కష్టతరం అవుతాయి. దీర్ఘకాలికంగా ఈ వ్యాధికి గురి అయినట్లయితే వ్యాధి తీవ్రత మరింత పెరిగి, కీళ్ల అమరికలో మార్పులు ఏర్పడి, కీళ్ల వైకల్యానికి దారి తీస్తుంది. కాబట్టి మొదట్లోనే దీనిని గుర్తించి, సరైన చికిత్స అందిచటం ద్వారా ఈ వ్యాధిని అంకురం నుంచే సమూలంగా తొలగించే అవకాశం ఉంటుంది.

లక్షణాలు :

ఈ వ్యాధికి గురైన కీళ్లలో - వాపు, నొప్పి , చేతితో తాకితే వేడిగా అనిపించడం, ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోవడం
 శరీరంలోని ఇరు పార్వ్శాల్లో ఉండే ఒకే రకమైన కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి లక్షణం.
 ఈ వ్యాధి మొదట చిన్న కీళ్లు అయిన చేతి వేళ్లు, కాలి వేళ్లు, వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మణికట్టు, మోచేతులు, భుజాలు, మోకాళ్లు, తుంటి, చీలమండలం వంటి కీళ్లను ప్రభావితం చేస్తుంది.
 కీళ్లు ప్రాంతపు చర్మం కింద ఫైబ్రస్‌ కణజాలం పెరగడంతో అవి బయటకు చిన్న కణితుల్లా కనిపిస్తాయి. వీటినే రుమాటాయిడ్‌ నాడ్యుల్స్‌ అని అంటారు.
 వీటితో పాటు నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, జ్వరం వంటి లక్షణాలు కూడా గమనించవచ్చు.
 ఈ వ్యాధి ప్రభావం- ఇతర ప్రధాన అవయవాలైన కళ్లు, చర్మం, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల పైన ఉండటం వలన కళ్లు , నోరు పొడిబారడం, ఛాతిలో నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వలన గుండెనొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు :

సి.బి.పి, ఇ.ఎ్‌స.ఆర్‌, ఆర్‌.ఏ. ఫ్యాక్టర్‌, ఏఎన్‌ఏ, యాంటీ సిసిపీ, ఎక్స్‌-రే, ఎమ్‌ఆర్‌ఐ మొదలైన పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

ఆయుర్వేద చికిత్స :

ఆయుర్వేద వైద్య చికిత్సా విధానంలో భాగంగా, రోగి శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిచడం ద్వారా ఈ వ్యాధి సంపూర్ణంగా నయం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతర కాంప్లికేషన్స్‌ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. 


ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.

For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/


Sciatica

సయాటికా నొప్పికి ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం


 సయాటికా, నడుమునొప్పి అనే పదాలు ఆధునిక యుగంలో యుక్త, మధ్య వయస్సు వారిలో వినని వారు ఉండరు. శరీరంలో అన్నిటి కన్నా పెద్ద నరం సయాటికా. ఇది కింది వీపు భాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగం గుండా పాదాల వరకు ప్రయాణిస్తుంది. మనిషి శరీర భాగాల్లో ముఖ్యమైనది వెన్నుపూస. సయాటికా నరం ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది. (ఎల్‌4, ఎల్‌5, ఎస్‌1,ఎస్ 2,ఎస్‌3) వెన్నుపూస లోపల నుంచి ప్రయాణించు నరాలపైన ఒత్తిడి వల్ల కాలు వెనక భాగం నొప్పికి గురవుతుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. వివిధ రకాల ఒత్తిడి వల్ల జీవన విధానంలో మార్పుల వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల, వెన్నెముకపై తీవ్రప్రభావం పడి వెన్నుపూసలో అరుగుదల మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్నిమిలియన్ల మంది సయాటికా బారినపడ్డారు.


సాధారణంగా అధిక బరువు ఎత్తడం వల్ల చాలా సేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల ముందుకు వంగి పనిచేయడం వల్ల వెన్నుముకపై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా వెన్నుముక కండరాలపై, నరాలపై ఒత్తిడినొప్పి ప్రారంభమవుతతుంది. ఈ నొప్పి వర్ణనాతీతంగా ఉంటుంది. వారి దైనందిన జీవితంలో ఆటంకం కలిగిస్తుంది. మొదట నొప్పి మొదలయినపుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను కొద్ది రోజుల్లో దూరం చేసుకోవచ్చు. కాని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. వెన్నుముక నొప్పి 12 వారాలకు పైగా ఉన్నట్లయితే దానిని దీర్ఘకాలిక నొప్పిగా పరిగణించి వైద్యులను సంప్రదించాలి.

కారణాలు:

శారీరకశ్రమ, వ్యాయామం లేక కీళ్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సయాటిక నొప్పి రావచ్చు.
స్పైనల్‌ డిస్క్‌ హెర్నియేషన్‌(ఎల్‌4, ఎల్‌5) నరాల రూట్స్‌ ఒత్తిడికి గురై సరైనపొజిషన్స్‌లో వంగక పక్కకు జరిగి నొప్పి రావచ్చు
బరువులు మోయడం వల్ల వెన్నుముకలోని కండరాలు, లిగమెంట్‌పై భారం పడినొప్పి వస్తుంది.
పని ఒత్తిడి పెరిగినపుడు, బరువులను ఎత్తడం వల్ల కొన్నిసార్లు డిస్క్‌ పక్కకు జరిగిపోతుంది. దీనిని స్లిప్‌ డిస్క్‌ అంటారు.
వయసు పెరిగిన కొద్దీ ఎముకలలో అరుగుదల వల్ల నొప్పి రావచ్చు.

లక్షణాలు:

కూర్చుంటే నొప్పి, కూర్చుని లేచేటప్పుడు విపరీతమైన నొప్పి.
కండరాల శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి వస్తుంది.
నరాలపై ఒత్తిడి పెరిగినపుడు కాళ్లలో నొప్పి రావడం తిమ్మిర్లు రావడం జరుగుతుంది.
డిస్క్‌ కంప్రెషన్‌ మూలంగా స్పైనల్‌ కెనాల్‌ మూసుకుపోవడం వల్ల నడవలేకపోవడం కాళ్లలో వణుకురావడం, మూత్రవిసర్జన, మల విసర్జనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

వ్యాధి నిర్ధారణ: 

ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, సిబిపి, ఈఎస్ ఆర్‌, డిస్క్‌ప్రొలాప్స్‌, డిస్క్‌హెర్నియేషన్‌.

ఆయుర్వేద చికిత్స:

సయాటికా నొప్పికి వెన్నుముక సమస్యకు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది. రోగి శారీరక లక్షణాలు, ఇతర ఆరోగ్య కారణాలను అనుసరించి మందులు ఇవ్వడం జరుగుతుంది.   మందులు అనుభవజ్ఞులైన డాక్టర్‌ పర్యవేక్షణలో వాడితే నొప్పి సమూలంగా , శాశ్వతంగా నయమవుతుంది.



ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

memory power

ఆయుర్వేద వైద్యంతో పిల్లల్లో ఏకాగ్రత 


 హోంవర్క్‌ పూర్తి చేయలేకపోవడం, చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి మరో పని మొదలుపెట్టడం, ఏకాగ్రత నిలపలేకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే సాధారణమే అని చాలామంది మిన్నకుండిపోతుంటారు. కానీ అది వారి శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు చేస్తున్న పనిపై ఏకాగ్రత నిలపలేకపోతున్నారంటే అది ఏడీహెచ్‌డీ సమస్య కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

కొందరు స్కూలు పిల్లలు ఏ పని పూర్తిగా చేయరు. హోంవర్క్‌ కాస్త చేసి వదిలి పెడతారు. మరో పని మొదలు పెట్టి దాన్ని కూడా మధ్యలోనే ఆపేస్తారు. దేనిపైన మనసును స్థిరంగా ఉంచలేకపోతుంటారు. ఏకాగ్రత కోల్పోతుంటారు. ఈ సమస్యను అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ)అంటారు.

ఈ సమస్య 8 నుంచి 10 శాతం మంది స్కూల్‌ పిల్లల్లో కనిపిస్తోంది. బాలికల కన్నా బాలురుల్లో మూడు రెట్ల ఎక్కువగా ఉంటోంది. ఈ డిజార్డర్‌తో బాధపడుతున్న వారు ఆలోచన లేకుండా పనులు చేస్తుంటారు. దీర్ఘకాలం పాటు ఇది కొనసాగినపుడు విద్యాపరంగా వెనకబడిపోతారు. సామాజిక పరంగా నలుగురిలో కలవలేకపోతారు. లక్షణాలను బట్టి ఈ డిజార్డర్‌ను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఇన్‌అటెంటివ్‌ ఏడీహెచ్‌డీ

 ఈ పిల్లలు ఏకాగ్రతను లగ్నం చేయలేరు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఎంజాయ్‌ చేస్తారు. టాపిక్స్‌ వింటున్నప్పుడు ఆసక్తి కనబరుస్తారు. అయితే పని రిపీట్‌ అయినపుడు, బోర్‌గా ఫీల్‌ అయినపుడు వెంటనే మారిపోతారు. ఒక పనిని కుదురుగా చేయలేకపోవడం మరొక సమస్య. పని పూర్తి చేయకుండానే మరొక పనికి మారిపోతారు. పాఠశాల పనిని పూర్తి చేయడం వారికి కష్టంగా ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటారు. తప్పులు చేస్తూనే ఉంటారు. ఒక అంశంపై ఏకాగ్రత పెట్టలేరు. ఇతరులు చెబుతున్నప్పుడు వింటున్నట్టుగా అనిపించదు. వస్తువులను గుర్తుపెట్టుకోలేకపోతారు. అప్పగించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతారు. అప్పగించిన పని పూర్తి చేసే ముందు బోర్‌గా ఫీలవుతారు. హోమ్‌వర్క్‌ చేయడం మర్చిపోతారు. బుక్క్‌, పెన్స్‌ ఎక్కడ పెట్టామో మరిచిపోతుంటారు.

 హైపర్‌యాక్టివ్‌ ఏడీహెచ్‌డీ:

 వీరు ఒకేసారి అనేక పనులు చేయాలని చూస్తుంటారు. ఒక యాక్టివిటీ నుంచి మరో యాక్టివిటీకి మారుతుంటారు. బలవంతంగా కూర్చోబెట్టినా కాలు నిలవదు. కాలును కదుపుతూనే ఉంటారు. చేతివేళ్లు ఆడిస్తూనే ఉంటారు. ఎక్కువగా మాట్లాడుతుంటారు. రిలాక్స్‌గా ఆడుకోలేరు. త్వరగా కోపానికి వస్తుంటారు.

 ఇంపల్సివ్‌ ఏడీహెచ్‌డీ:

ఈ పిల్లల్లో స్వీయ నియంత్రణ ఉండదు. క్లాసులో పొంతన లేని ప్రశ్నలు అడుగుతుంటారు. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్‌ చేస్తుంటారు. మూడీగా ఉంటారు. ఎమోషనల్‌గా ఓవర్‌యాక్ట్‌ అవుతారు. ఏ మాత్రం ఆలోచించకుండా రియాక్ట్‌ అవుతుంటారు. ప్రశ్న పూర్తిగా వినకుండానే సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తారు. తన సమయం, నెంబర్‌ వచ్చే వరకు ఆగలేకపోతారు. తరచుగా ఇతరులను డిస్టర్బ్‌ చేస్తుంటారు. ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి బదులుగా గెస్‌ చే స్తుంటారు.

కారణాలు :

జన్యుపరమైన అంశాలు, చుట్టూ ఉన్న పరిసరాలు, ఆహారపు అలవాట్లు కొంత వరకు కారణమవుతాయి. 75 శాతం కేసుల్లో జన్యుపరమైన అంశాలు కారణంగా ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది. గర్భిణిగా ఉన్న సమయంలో పొగతాగడం, ఆల్కహాల్‌ సేవించడం వంటివి కూడా కారణమవుతున్నాయి. నెలల నిండకముందే డెలివరీ కావడం, ప్రెగ్నెసీ సమయంలో ఇన్‌ఫెక్షన్లు రావడం, స్ట్రెప్టోకాకల్‌ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు వంటివి కారణంగా ఉంటున్నాయి. పండ్లు, కూరగయాలపై వాడే క్లోరోఫైరిఫాస్‌ అనే పురుగుల మందు వల్ల పిల్లల్లో బిహేవిరియల్‌ ప్రాబ్లమ్స్‌ వస్తున్నాయి.


ఆయుర్వేద చికిత్స:

ఏడీహెచ్‌డీ సమస్యకు ఆయుర్వేద చికిత్స అందించడం ద్వారా సమూలంగా తగ్గించే వీలుంది. శారీరక లక్షణాలను గమనించడంతో పాటు డైట్‌, లైఫ్‌స్టయిల్‌, వ్యక్తిత్వం, ఎమోషన్‌కు గురిచేస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.  త్వరగా కోలుకోవడం జరుగుతుంది. పైగా ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. 


ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Psoriasis

సొరియాసిస్‌కు ఆయుర్వేదమే శాశ్వత పరిష్కారం

శరీరానికి చర్మం ఒక రక్షణ కవచం. ఎండ, వాన,చలి నుంచే కాకుండా అన్ని రకాలైన క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్‌ జబ్బుల నుంచి శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కాపాడుతుంది. కొన్నిసార్లు రోగనిరోధక శక్తి సొంత శరీరంపైనే దాడి చేస్తుంది.

సాధారణంగా చర్మకణాలు ఎప్పటికప్పుడు రాలిపోతుంటాయి. కింది పొరల్లోంచి పుట్టుకొచ్చిన కొత్త కణాలు పైకి వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఇది మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియకు సాధారణంగా నెల రోజులు పడుతుంది. కాని సొరియాసిస్‌ వ్యాధిలో ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. దాంతో మందంగా ఉండే ఎర్రటి మచ్చలు వాటిపై తెల్లని పొలుసులు ఏర్పడతాయి. ఇవి పొట్టుగా రాలిపోతుంటాయి. ఈ సమయంలో దురద కూడా మొదలవుతుంది. సొరియాసిస్‌ శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. సాధారణంగా మోచేతులు, మోకాళ్లు, మాడు, వీపు, ముఖం, అరిచేతులు, పాదాల మీద ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు:

లేత గులాబీ రంగు లేక ఎర్రటి మందమైన మచ్చలు, వాటిపైన తెల్లని పొలుసులు ఏర్పడతాయి. చర్మం ఎండిపోవడం, పగలడం, కొన్నిసార్లు చర్మం నుంచి రక్తస్రావం కావడం కనిపిస్తుంది. చర్మంపై మంట, దురద పెట్టడం, గోళ్లు మందంగా కావడం, గుంతలు పడటం, చీముతో కూడిన గుల్లలు రావడం జరుగుతుంది.

సొరియాసిస్‌ దీర్ఘకాల సమస్య. ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. తల్లిదండ్రులలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి కూడా వస్తుంది. స్థూలకాయం మూలంగా కూడా ముప్పు పెరుగుతుంది. గొంతునొప్పి, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల, అధిక రక్తపోటుకు వాడే మందుల వల్ల, మలేరియా నివారణ మందులు, చల్లని వాతావరణం, పొగతాగడం, అతిగా మద్యం తాగడం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది.

ఈ వ్యాధి తీవ్రత వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. 1) సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ 2) ఊబకాయం, 3) కంటి సమస్యలు 4) మధుమేహం 5) కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి.

ఈ వ్యాధిని చాలా వరకు లక్షణాలను బట్టి గుర్తిస్తారు. చర్మం, మాడు, గోళ్లను పరీశిలించి సమస్యను నిర్ధారించవచ్చు.

ఆయుర్వేద చికిత్స:

ఆయుర్వేద వైద్య విధానం సొరియాసిస్‌ను సమూలంగా నిర్మూలిస్తుంది. ఈ వ్యాధి వర్షాకాలంలో తీవ్రమవుతుంది. కొందరిలో కాలంతో సంబంధం లేకుండా కూడా వ్యాధి పెరగడం జరుగుతుంది. ఆయుర్వేదంతో వ్యాధిని మూలాల్లో నుంచి తొలగించడం జరుగుతుంది. దురదను చాలా త్వరగా అదుపు చేయవచ్చు. వ్వాప్తి చెందడాన్ని కూడా త్వరితంగా అదుపు చేయవచ్చు.

అతిగా పత్యాలు కూడా అవసరం లేదు.


ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది.  ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies  పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

స్వర్ణ వాత రాక్షసం

స్పాండిలైటిస్, లంబార్ మరియు తత్సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ ఒౌషధం.
గమనిక: కేవలం శాశ్వత నివారణ కోరుకునే వారికి మాత్రమే.
1. స్వర్ణ భస్మం 10 g
2. నాగ భస్మం 10 g
3. వంగ భస్మం 10 g
4. లోహ భస్మం 10 g
5. తామ్ర భస్మం 10 g
6. కాంత భస్మం 10 g
7. రజిత భస్మం 10 g
8. శుద్ద గంధకం 10 g
9. హేమ మాక్షిక భస్మం 10 g
10. శుద్ద కఫరి 10 g
11. శుద్ద తుత్తం 10 g
12. శుద్ద తాళకం 10 g
13. శుద్ద మణిశ్శిల 10 g
14. వెలిగారం 10 g
15. ఇంగిలీకం 50 g
16. వరాట భస్మం 10 g
17. శంఖ భస్మం 10 g
18. అభ్రక భస్మం 10 g
పై వస్తువులన్నింటిని మెత్తగా కల్వమందు నూరి విడివిడిగా వరుసగా అల్లపు రసంతో 3 రోజులు, లవంగ కషాయంతో 3 రోజులు, చిత్రమూలం కషాయంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి బాగా ఎండించి, గాజు కుప్పెలో పోసి, సీలు చేసి వాలుకా యంత్రమునందు కమలాగ్నిచే వండవలెను. తరువాత సాంగశీతలమున తీసి అనుపాన విశేషములతో వాడనగును.
స్పాండిలైటిస్ , లంబార్ స్పాండిలైటిస్ తత్సంబంధిత వ్యాధులన్నింటిని నిస్సందేహముగా శాశ్వతంగా నివారించడానికి తగిన సామర్ధ్యం కలిగిన దివ్యెౌషధం.
అనుపాన విశేషములతో సర్వవిధ వాత వ్యాధులన్నింటిని పోగొట్టగలదు.
#*# ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  

For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda

స్వర్ణ క్రవ్యాద రసం

అల్సర్ ఏ స్ధాయిలో వున్నాసరే.....
గమనిక: శాశ్వత పరిష్కారం కావాలనుకునే వారికి మాత్రమే.
1) స్వర్ణ భస్మం 10 g
2) కాంత భస్మం 10 g
3) తామ్ర భస్మం 10 g
4) లోహ భస్మం 10 g
5) రజత భస్మం 10 g
6) శంఖ భస్మం 10 g
7) శుద్ధ గంధకం 80 g
8) శుద్ధ రసం 40 g
9) టంకణం 180 g
10) పంచ లవణాలు 90 g
11) మిరియాలు 450 g
** ముందుగా 1—6 వస్తువులను మాదీ ఫల రసముతో బాగా మర్ధన చేసి, ద్రవముగా వుండగానే ఇనుప మూకుడులో పోసి వుంచవలేను.
** 7,8 వస్తువులను కల్వములో బాగా కజ్జలి చేయాలి. ఈ కజ్జలిని పై మూకుడులో వేసి కలిపి సన్నని సెగపై ద్రవమిగురువరకు వుంచి, దానిని తీసి కల్వములో వేసి ఆమ్లవేతనము, మాదీ ఫల రసము, పుల్ల దానిమ్మ గింజల రసము, పులి చింతాకు రసము వీటితో విడివిడిగా ఏడు సార్లు భావన చేసి, తరువాత పంచకోల కషాయముతో యేబది సార్లు భావనలు చేయవలెను.
** తరువాత 9,10,11 వస్తువులను చేర్చి బాగా మర్ధించి, శనగ పులుసుతో ఇరువదిఒక్క సారి భావన మర్ధనలు చేసి మాత్ర పాకమునకు వచ్చిన తరువాత వాడవలెను.
*#* " అల్సర్ " ఏ స్ధాయిలో వున్నా నిశ్శేషముగా పోగొట్ట గలిగిన దివ్యెౌషధం.
## సాధారణ స్ధాయిలో వున్న అల్సర్ కు స్వర్ణ భస్మం ఉపయోగించనవసరం లేదు.
#*# ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

చిత్రకాది వటి

గ్యాస్ట్రిక్ ట్రబుల్ , కడుపుబ్బరం,త్రేనుపులు మొదలగు అజీర్ణ వ్యాధులకు శాశ్వత నివారణ ఒౌషధం.
గమనిక: శాశ్వత పరిష్కారం కోరుకుంటున్న వారికి మాత్రమే.
1) చిత్ర మూలము 40 g
2) మోడి 40 g
3) యవాక్షారం 10 g
4) సర్జ క్షారం 10 g
5) సముద్ర లవణం 5 g
6) సౌవర్చ లవణం 5 g
7) సైంధవ లవణం 5 g
8) కాచ లవణం 5 g
9) బిడా లవణం 5 g
10) సొంఠి 10 g
11) పిప్పళ్ళు 10 g
12) మిరియాలు 10 g
13) ఇంగువ 10 g
14) వాము 10 g
15) చవ్యం 10 g
16) జీలకర్ర 10 g
17) చిరు బొద్ది 10 g
18) నల్ల ఉప్పి 10 g
19) కర్కాటక శృంగి 10 g
20) అక్కలకర్ర 10 g
21) నిమ్మ ఉప్పు 10 g
22) శంఖ భస్మము 10 g
23) వరాట భస్మము 10 g
24) మౌక్తిక భస్మము 10 g
# పైన చెప్పబడిన చిత్రమూలము, మోడిలను మెత్తగా చూర్ణం చేయాలి.
# లవణాలు 5—9 చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇనుప బాండీలో వేయించి చూర్ణం చేయాలి.
# శొంఠిని నిప్పులపై కాల్చి చూర్ణం చేయాలి.
# పిప్పళ్ళను వేయించి చూర్ణం చెయ్యాలి.
# మిరియాలను రాత్రి పూట మజ్జిగలో నానబెట్టి పొద్దున వేడి నీటితో కడిగి ఎండించి చూర్ణం చేయాలి.
# ఇంగువను పొంగించి చూర్ణం చెయ్యాలి.
# వామును వేయించి చూర్ణం చెయ్యాలి.
# జీలకర్రను వేయించి చూర్ణం చెయ్యాలి.
*** పైన చెప్పబడిన వస్తువులనన్నింటిని అల్లము రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** పై చూర్ణంను కారు మునగ గడ్డల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** పై చూర్ణంను నారింజ రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** పై చూర్ణంను పుల్ల దానిమ్మ లేదా మాదిఫల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*** చివరిగా పుల్ల ప్రబ్బలి పండ్ల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*# పై చూర్ణంను నిమ్మ రసంతో నూరి మాత్రలు (pills)చేసి ఆరబెట్టి వాడుకోవాలి.
ఇది పూర్తి శాస్త్రీయ ఒౌషధ తయారీ విధానము.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ , కడుపుబ్బరం,త్రేనుపులు మొదలగు అజీర్ణ వ్యాధులను శాశ్వతంగా నివారణ చేయగలిగిన ఆయుర్వేద దివ్యెౌషము.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
 For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook
https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Saturday, August 5, 2017

Abdomen pain in lades

స్త్రీలకు రుతు కాలంలో వచ్చే కడుపు నొప్పి....శాశ్వతంగా నివారించడం సాధ్యమే.

స్త్రీలలో నెలసరి సమయంలో నొప్పి రావడాన్ని వైద్యపరిభాషలో డిస్మనోరియా లేక పెయిన్‌ఫుల్‌ మెన్సెస్‌ అంటారు. ఆయుర్వేద పరి భాషలో దీనిని "రుతు శూల" అంటారు.
సుమారు 50 శాతం మంది స్త్రీలు పీరియడ్స్‌ సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమేణ వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది స్త్రీలలో వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది.
రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. 3 రోజుల నుంచి 7 రోజుల పాటు కనిపిస్తుంది. రుతుక్రమాన్ని, రుతుస్రావాలను మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరీగ్రంథి, ఆండాశయంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ అన్నీ కలిపి ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, హార్మోన్ల వ్యవస్థపై బలమైన ప్రభావం చూపుతుంది. రుతుక్రమం సమయంలో నొప్పి రావడానికి గల ప్రధాన కారణం ప్రొస్టాగ్లాండిన్స్‌ అనే ఒక రసాయనం. ఈ రసాయనం గర్భకోశం లోపలి పొరల్లో ఉత్పత్తి అవుతుంది.
రుతు శూలను రెండు రకాలుగా చెప్పవచ్చు.
1. ప్రైమరీ డిస్మనోరియా : యుక్తవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. దీనికి హార్మోన్‌ అసమతుల్యత ప్రధానమైక కారణంగా ఉంటుంది.
2. సెకండరీ డిస్మనోరియా : వయసు పైబడిన స్త్రీలలో కనిపిస్తుంది. పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్లు, గర్భాశయ కణుతులు ప్రధానమైన కారణం.
ముఖ్యకారణాలు:
హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ కణుతులు, గర్భాశయ ముఖద్వారం ఇరుకుగా ఉండటం, ఓవేరియన్‌ సిస్టులు.
వ్యాధి లక్షణాలు:
రుతుక్రమ సమయానికి 3 నుంచి 7 రోజుల ముందు నొప్పి మొదలవుతుంది. దీన్ని కంజెస్టివ్‌ డిస్మనోరియా అంటారు. రుతుస్రావం మొదలయిన తరువాత నొప్పి ప్రారంభమై రక్తస్రావం తీవ్రంగా ఉండి ఒకటి రెండు రోజుల వరకు కొనసాగే నొప్పిని స్పాస్‌మోడిస్‌ డిస్మనోరియా అంటారు. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో పాటు, వెన్నునొప్పికూడా బాధిస్తుంది. విపరీతమైన చిరాకు, కోపం, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలుంటాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
హార్మోన్ల సమతుల్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తినాలి. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి.
ఆయుర్వేద చికిత్స:
రుతుశూలకు ఆయుర్వేదంలో శాశ్వత చికత్స ఉంది. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే రుతుశూల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన అవసరం లేదు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Asthma

ఇన్‌హేలర్‌.. హెల్త్‌ కిల్లర్‌ఇన్హేలర్ అవసరం లేకుండా చేయడం ఆయుర్వేదానికి సాధ్యమే.....

చెప్పులోన రాయి.. చెవిలోని జోరీగ.. ఇలా వేమన చెప్పిన నలుసులు మనిషికి తాత్కాలిక అసౌకర్యాన్ని కల్పిస్తాయేమో కానీ ఆస్తమా మాత్రం ఆజన్మాంతం వెంటాడుతూనే ఉంటుంది. తొలకరి పలకరిస్తే చాలు ఆస్తమా బాధితులు బెంబేలెత్తిపోతుంటారు. ఉబ్బసంతో సతమతమవుతుంటారు. ఇన్‌హేలర్‌తో తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంటారు. అయితే ఆస్తమా బాధితుల శరీరాలు వైద్యానికి అంతగా సహకరించడం లేదని ఇటీవల పరిశోధనల్లో తేలింది.
ఆస్తమాతో పాటు వారికి ఏ ఇతర జబ్బులు వచ్చినా.. ఇదే పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు అమెరికాలోని నేషనల్‌ జెవిష్‌ హెల్త్‌ సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ మైఖేల్‌ వెష్లర్‌. ముప్పయ్‌, ఆపై వయసు కలిగిన 1,200 మంది ఆస్తమా పేషంట్లను మైఖేల్‌ టీమ్‌ స్టడీ చేసింది. ఆస్తమాను పూర్తిగా తగ్గించలేక పోవడం వెనుక ఇన్‌హేలర్‌ వాడకం కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషించింది.
ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారినపుడు ఆస్తమా పేషంట్లు ఇన్‌హేలర్‌ వాడుతుంటారు. ఎక్కువసార్లు దీనిని వాడటంతో వైద్యానికి వారి శరీరాలు అనుకూలంగా స్పందించడం లేదని, అందువల్లే ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ పెరుగుతున్నాయని స్టడీ సారాంశం.
ముప్పయ్‌, ఆ పైబడిన వయసు వారిలో 17.3 శాతం ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ నమోదయ్యాయి. ముప్పయ్‌ ఏళ్లకు తక్కువున్న వారిలో ఇది 10.3 శాతంగా నమోదైంది. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తమా ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల.. ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ సంభవిస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తమా ప్రభావం స్త్రీ, పురుషులపై దాదాపు ఒకే విధంగా ఉందని చెబుతున్నారు.
కానీ, ఆయుర్వేద చికిత్స ద్వారా ఆస్తమా వ్యాధిని నివారించడం చాలా తేలిక. అల్లోపతి మందులకన్నా కూడా చాలా త్వరగా ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. అంతే కాకుండా దుష్ప్రభావాలు కొంచెం కూడా వుండవు.


ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు. 
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Fibroids

గర్భసంచిలో ఈ గడ్డలేంటి?

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశమూ లేదనే చెప్పుకోవచ్చు.
గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి.
గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. ఈస్ట్రోజెన్‌ హార్మోను వీటిని ప్రభావితం చేస్తుందన్నది మాత్రం సుస్పష్టమైంది. ఇవి కొందరిలో వేగంగా మరికొందరిలో నెమ్మదిగా పెరగొచ్చు. కొన్ని ఎప్పుడూ ఒకే సైజులో ఉండొచ్చు, కొన్ని వాటంతటవే కుంచించుకుపోవచ్చు. నెలసరి నిలిచిపోయిన తర్వాత సహజంగానే ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్లు కూడా చిన్నగా అవుతాయి. కొన్నైతే రాళ్లలా గట్టిపడిపోతాయి కూడా.

అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?
అల్లోపతి  వైద్య విధానం:
ఫైబ్రాయిడ్లు ఉన్నా బాధలేవీ లేకపోతే ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.
సైడెఫెక్ట్స్:
 అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల వీటిని 3-6 నెలల కన్నా ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేసే ఐయూడీని లోపల అమరుస్తారు. ఇది రుతుస్రావం అధికంగా కావటాన్ని తగ్గిస్తుంది. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం అబ్లేషన్‌ ప్రక్రియతో కణితికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని మూసేసే పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీంతో గడ్డ క్రమేపీ చిన్నదై, మాయమవుతుంది.
ఆయుర్వేదం చెప్పే కారణాలు:
ఇవిరావడానికి ప్రధాన కారణం చిత్తచాంచల్యము... ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది... అశోక, నాగకేసరాలు , భూమ్యామలక, దూసరాకు (పైనపట్టుగావేయుట) కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా మొరటువైద్యంవలన ఫలితం శూన్యం... సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం...
----Janardhana Ramanuja Das pyla గారు
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా అత్యుత్తమ చికిత్స కలదు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Ulcer

అల్సర్ల పరిష్కారానికి ఆయుర్వేదమే ఉత్తమం

చాలాకాలంగా బాధపడుతున్నా కొందరు తమకు అల్సర్‌ ఉందన్న విషయాన్నే గుర్తించరు. ఇదేదో గ్యాస్ట్రిక్‌ సమస్యేలే అనుకుని అలాగే ఉండిపోతారు. ఇలాంటి వారిలో అల్సర్‌ పెరిగిపెరిగి పెద్ద రంధ్రం బడి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల బారిన (పెరిటోనైటిస్‌) పడవచ్చు. శరీరంలోని కీలక భాగాలన్నీ దెబ్బతిని ఒక్కోసారి ప్రాణాపాయమే ఏర్పడవచ్చు. ఎవరైనా యాంటాసిడ్‌ మాత్రలతో కాలయాపన చేయాలనిచూస్తే అల్సర్‌ కేన్సర్‌గా మారే ప్రమాదమూ ఉంది. అందుకే అల్సర్‌ లక్షణాలు కనిపించిన మరుక్షణమే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే అల్సర్‌ల నుంచి శాశ్వత విముక్తిని పొందవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
పొద్దుపొద్దున్నే అలార్మ్‌ క్లాక్‌కన్నా ముందుగా మీ కడుపు నొప్పి మీరు కళ్లుతెరిచేలా చేస్తుంది. రోజుకు అరడజను యాంటాసిడ్‌ మాత్రలు కడుపులోకి జారుతూనే ఉంటాయి. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే సమయంలో ‘‘నా ఆహారపు అలవాట్లన్నీ సమూలంగా మార్చేసుకోవాలి. లేకపోతే నేనింక బతకలేను’’ అనుకున్నాడు. అంతవరకే చూస్తే అతనిలో ఎంతో పరివర్తన వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ, ఆ మరుసటి రోజున మళ్లీ మామూలే. ఫాస్ట్‌ ఫుడ్‌లు, మసాలా తిళ్లూ ఏ ఒక్కటీ మిస్సయిపోదు.
కొంతమంది స్త్రీలు ఉపవాసాల పేరిట, ఒక్కపొద్దుల పేరిట, పని ఒత్తిళ్ల పేరిట ఎంతో మంది వారానికి నాలుగు రోజులు వేళకు బోంచేయక ఈ అల్సర్‌ బారిన పడుతుంటారు. రాత్రివేళ కూడా వదలని నిరంతరపు కడుపు నొప్పితో నిద్రలేమి సమస్య మొదలవుతుంది. దీంతో మొత్తం జీవక్రియల్లోనే తేడా వస్తుంది.
ఎందుకిలా?
అల్సర్లు రెండురకాలు. వాటిలో ఒకటి జీర్ణాశయంలో వచ్చే గ్యాస్ట్రిక్‌ అల్సర్‌. రెండవది చిన్నపేగులో వచ్చే డియోడినల్‌ అల్సర్‌. ఈ రెండింటినీ కలిపి పెప్టిక్‌ అల్సర్‌ అంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి రోజూ చేసే భోజనవేళల్లో శరీరం హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఆమ్లం ఆహారాన్ని అత్యంత సూక్ష్మభాగాలుగా విడదీస్తుంది. దీనికితోడు పెప్సినోజిన్‌ అనే ఆమ్లం కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటుంది. జీర్ణాశయంలో పేగుల్లో మ్యూకస్‌ మెంబ్రేన్‌ అనే పల్చటి పొర ఉంటుంది. వేళకు భోంచేస్తే ఆమ్లాలు ఆ ఆహారాన్ని విభజించే పనిలో పడతాయి.
భోజనం చేసినా, చేయకపోయినా ఆ నిర్ధిష్టవేళల్లో విడుదల అయ్యే ఆ ఆమ్లాలు ఒకవేళ ఆ సమయంలో ఏమీ తినకపోతే, లోపలున్న మ్యూకస్‌ మెంబ్రేన్‌ను దెబ్బ తీస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే, దెబ్బతిన్న మ్యూకస్‌మెంబ్రేన్‌ను హెచ్‌-పైలోరి అనే బ్యాక్టీరియా ఆ భాగాన్ని ఆవహించి అల్సర్‌ అయ్యేలా చేస్తుంది. ఈ అల్సర్‌ ఎక్కువ కాలం అలాగే కొనసాగితే అది కేన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంది.
ఎలా తెలుస్తుంది?
కడుపు నొప్పితో పాటు ఛాతీలో నొప్పి, మంటా ఏర్పడతాయి. కడుపులో ఉబ్బరం, ఒక అసౌక ర్యంగా అనిపిస్తుంది. అల్సర్లతో తరుచూ రక్తస్రావం కావడం వల్ల రక్తహీనత కూడా రావచ్చు. అల్సర్లతో కొందరిలో ఖాళీ కడుపున ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తే, కొందరిలో ఏమైనా తిన్నప్పుడు నొప్పి వస్తుంది. అల్సర్ల కారణంగా నోటి దుర్వాసన కూడా రావచ్చు.
అల్సర్లు ఏర్పడ్డాక గానీ, ఏర్పడటానికి ముందు గానీ, ఇలా దుర్వాసన రావచ్చు. వీపు వెనుక రెండు జబ్బల మధ్య పట్టేసినట్లు అనిపిస్తుంది. వీళ్లల్లో మలబద్దకం గానీ, విరేచన సమస్యగానీ ఉండవచ్చు. వికారమూ, వాంతులూ ఉండవచ్చు. అలాగే ఆకలి తగ్గడం, అజీర్తి సమస్య రావచ్చు. ఏ కొంచెం తిన్నా కడుపు పూర్తిగా నిండిపోయిన భావన కలుగుతుంది. కొందరిలో అస్తమానం నీళ్లూ ఊరడం కూడా కనిపిస్తుంది. ఇదీ అల్సర్‌ లక్షణమే.
అల్సర్‌ వల్ల బరువు తగ్గడంతోపాటు కొందిరిలో నీరసం నిస్సత్తువా ఉంటాయి. కొందరిలో తలనొప్పి, పార్శ్వపు నొప్పి కూడా రావచ్చు. వీటితోపాటే దిగులూ ఆందోళన కూడా ఉంటాయి. చర్మ సమస్యలు, రుతుక్రమంలో తేడాలు ఇవన్నీ తలెత్తే ప్రమాదం ఉంది. 

అసలైన వైద్యం

అల్లోపతి విధానంలో యాంటాసిడ్స్‌ ఇవ్వడం అనేది సమస్యను తటస్థంగా ఉంచడానికి మాత్రమే. అయితే ఈ యాంటాసిడ్స్‌ వల్ల తాత్కాలిక ఉపశమనమే లభిస్తుంది. యాంటీబయాటిక్స్‌ వల్ల హెచ్‌పైలోరి బ్యాక్టీరియా అయితే చనిపోవచ్చు కానీ, మ్యూకస్‌ మెంబ్రేన్‌ పొర దెబ్బ తిన్న కారణాన్ని మాత్ర వాళ్లు పట్టించుకోవడం లేదు. ఆయుర్వేదం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఆయుర్వేదం మొత్తం జీర్ణవ్యవస్థను పెద్దపేగు,చిన్న పేగు వ్యవస్థలన్నిటినీ చక్కబరుస్తుంది.
జఠరాగ్నిని ఉత్తేజితం చేయడం ద్వారా మొత్తం జీర్ణవ్యవస్థనే శక్తివంతంగా మార్చగలుగుతున్నాం. ఆయుర్వేదంతో అల్సర్‌ సమస్య సమూలంగా పోవడమే కాదు. మీ ఆకలి, మీ జీర్ణశక్తి పెరిగి మీ జీవితం తిరిగి ఒక గొప్ప ప్రామాణికతను సంతరించుకోవడానికి ఆయుర్వేదం అండగా నిలబడుతుంది.
ఆయుర్వేదం హెచ్‌ పైలోరా ఇన్‌ఫెక్షన్లను తొలగించి, అల్సర్‌ లక్షణాలను నిర్మూలించి, అది మరోసారి రాకుండా చేసి అల్సర్‌ తాలూకు ఏ బాధా లేకుండా చేస్తుంది. ఆ త రువాత మీ ఆహారాన్ని మీరు ఆస్వాదించవచ్చు. మీ ఆనందాన్ని మీరు పొందవచ్చు. మీ జీవితాన్ని దివ్యంగా జీవించవచ్చు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Drink Addiction

మద్యపాన వ్యసనాన్ని మాన్పించడం సాధ్యమే.మద్యపానం చేసే వారికి కూడా తెలియకుండానే....మద్యం మానుకుని.......శారీరక, మానసిక, ఆర్ధిక బాధలన్నింటిని పోగొట్టుకోవడం సాధ్యమే.వ్యక్తిగతంగా, కుటుంబంలో, బంధు వర్గంలో, సమాజంలో హుందాగా, గౌరవ ప్రదంగా జీవించడం సాధ్యమే.కాలేయ, మూత్రపిండ, పక్షవాత వ్యాధుల బారిన పడకుండా వుండడం సాధ్యమే.షుగర్ వ్యాధిని అదుపులో వుంచడం సాధ్యమే.ఒకటేమిటి అన్ని రకాలయిన అవమానాల నుండి విముక్తి పొందడం సాధ్యమే.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.   
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Sex Power

శృంగార సమస్యలకు వాజీకరణ చికిత్స

మారిన జీవనశైలి కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి, డయాబెటిస్‌ వంటి ఆరోగ్య సమస్యలు పురుషులలో లైంగిక పరమైన సమస్యలకు దారితీస్తున్నాయి. వీటిలో ప్రధానంగా అంగస్తంభన సమస్య పురుషులను మానసికంగా కృంగదీస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ వాజీకరణ చికిత్స ద్వారా పురుషులలో ఏర్పడే అన్ని రకాల లైంగిక సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం ఆయుర్వేదం ద్వారా సాధ్యమే.
పురుషులు బాధపడే శృంగార సమస్యలలో అంగస్తంభన, శీఘ్రస్ఖలన, కోరికలు తగ్గడం ప్రధానమైనవి. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది అంగస్తంభన సమస్య. దీనిని ఆయుర్వేదంలో నపుంసికత లేక క్లైభ్యంగా పేర్కొనబడింది. శృంగారంలో పాల్గొన్నపుడు లేక హస్తప్రయోగం చేస్తున్నపుడు అంగం తగినంతగా స్తంభించకపోవడం లేక ఒకవేళ స్తంభించిన చివరివరకు తగినంతగా స్తంభించి ఉండకపోవడాన్ని అంగస్తంభన సమస్యగా చెప్పవచ్చును.
ఈ సమస్యతో బాధపడేవారిలో సెక్స్‌ కోరికలు మామూలుగానే ఉంటాయి. మగవారిలో సర్వసాధారణంగా అంగస్తంభన సమస్యతో 30 శాతం మంది బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మంది, 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో 60 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్లమందికిపైనే అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
కారణాలు :
అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడడం జరుగుతుంది.
అంగంలోకి రక్తప్రసరణ జరగకపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం.
అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు.
మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం, డిప్రెషన్‌, ఫెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ మొదలైన మానసిక కారణాల వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.
డిప్రెషన్‌, పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్‌ సామర్ధ్యంపైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.
ఆల్కహాల్‌ తీసుకోవడం, పొగత్రాగడం, గుట్కాలు నమలడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది.
హార్మోన్ల లోపాల వల్ల ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
అధిక బరువు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా నాడులు, రక్తనాళాలు వికృతి చెందడం వల్ల అంగస్తంభన సమస్య మిగిలిన వ్యాధుల కంటే ఎక్కువగా ఉంటుంది. నాడీ సంబంధ వ్యాధులు, సుఖ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్యలు ఏర్పడవచ్చు.
ఎక్కువ కాలం ఇతర వ్యాధులకు వాడిన మందుల వల్ల కూడా 25 శాతం మందిలో ఈ సమస్య రావచ్చు.
అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్‌, అల్సర్‌, కేన్సర్‌ సంబంధిత వ్యాధులకు, నొప్పి, వాపు తగ్గించే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

జాగ్రత్తలు :
అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆయుర్వేద వాజీకరణ చికిత్స :
అంగస్తంభన సమస్యకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే కేటాయించారంటే ఆయుర్వేదం ఈ సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెప్పవచ్చు. ఆ విభాగాన్నే ‘వాజీకరణ చికిత్స’గా పేర్కొన్నారు. వాజీకరణ ఔషధాలు వాడినట్లయితే పురుషులలో శృంగార సమస్యలతోపాటు సంతానలేమి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ఆయుర్వేద వాజీకరణ ఔషధాలను 4 నెలల నుండి 6 నెలలపాటు శృంగార సమస్యలపై ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడినట్లయితే అంగస్తంభన సమస్యను సులభంగా తొలగించుకోవచ్చు.
రహస్యంగా ఏవో క్యాప్సూల్స్ వేసుకొని సెక్స్ బలహీనతల నుండి బయట పడవచ్చనుకోవడం చాలా తప్పు. "సిరులలో కెల్ల మగసిరి మిన్న, మగసిరి లేని సిరులు నిరర్ధకం. స్త్రీ పురుషుల అన్యోన్యతకు మూలం మగసిరియే కదా".
ఈ విషయంలో సిగ్గు పడుట తగదు. సప్త ధాతు సమతుల్యత లోపించుట వలన, అనారోగ్యము వలన సెక్స్ బలహీనతలు కలుగుతున్నాయి. దీనిని ఆయుర్వేదంలో " వాజీకరణ చికిత్స " అని అంటారు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....
#*# శాశ్వత నివారణ ఒౌషధములకు సంప్రదించగలరు.  
For Contact:
Dr.Mahesh
Mathrusree Ayurveda & Siddha
cell no: 97019 65700

follow on facebook

https://www.facebook.com/mathrusreeayurveda/
http://mathrusree-ayurveda-siddha.business.site/

Bronchitis asthma

Bronchitis asthma.,. ఆస్తమా వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం కలదు. ఇన్హేలర్ మరియు ఇంజక్షన్స్ అవసరం లేకుండా కేవలం కొన్ని నిమిషాలలోనే ...